పదేళ్లలో నేను పీసీసీ చీఫ్ను అవుతా... ముఖ్యమంత్రిని కూడా అవుతా: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్య
- గాంధీ భవన్లో తనకు అటెండర్ పదవి ఇచ్చినా చేస్తానని వ్యాఖ్య
- ఎవరు పీసీసీ అయినా పాలన బాగానే ఉంటుందని ఆశాభావం
- మోదీ పవర్ తాత్కాలికమేనన్న జగ్గారెడ్డి
సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల పవర్కు, ప్రధాని మోదీ పవర్కు చాలా తేడా ఉందన్నారు. పర్మినెంట్ పొలిటికల్ పవర్ సోనియా, రాహుల్ గాంధీలదే అన్నారు. కానీ రాజకీయాల్లో మోదీది తాత్కాలిక పవరే అని బీజేపీ వారు గుర్తించాలన్నారు. ప్రధానిగా ఆయన దిగిపోయాక బీజేపీలోనే పవర్ ఉండదన్నారు. ప్రజలు మూడోసారి చాలా కష్టంగా మోదీకి అధికారం అప్పగించారన్నారు.
గత పదేళ్లలో తాను ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అంగీకరించి... ఇప్పుడైనా వాటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గోద్రా అల్లర్లు, పుల్వామా ఘటనలపై పార్లమెంట్లో చర్చించే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ అని మాట్లాడే బీజేపీ... ఆ సమయంలో లేనే లేదన్నారు. నాడు జనతా పార్టీలో ఉన్న వాజపేయి... ఇందిరాగాంధీని దుర్గామాతతో పోల్చారని గుర్తు చేశారు.