నరేంద్రమోదీ కేబినెట్లో టీడీపీ నుంచి వీరికి ఛాన్స్... జేడీయూ నుంచి ఇద్దరికి?
- టీడీపీ నుంచి నలుగురికి మోదీ కేబినెట్లో అవకాశం
- రామ్మోహన్ నాయుడు, హరీశ్ బాలయోగి, దగ్గుమళ్ల ప్రసాద్లకు ఛాన్స్?
- జేడీయూ నుంచి లలన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్లకు అవకాశం
రేపు రాత్రి 7.15 గంటలకు మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకంటే ముందు ఎన్డీయే కూటమి నేతలు సమావేశమై, కేబినెట్ బెర్త్లపై నిర్ణయం తీసుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ 16 లోక్ సభ స్థానాలు గెలుపొందగా నాలుగు మంత్రిత్వ శాఖలు, స్పీకర్ పదవిని కోరింది. 12 సీట్లు గెలిచిన జేడియూ 2 శాఖలు అడిగింది. బీజేపీ 240 సీట్లు మాత్రమే గెలిచి మేజిక్ ఫిగర్కు 32 సీట్ల (272) సీట్ల దూరంలో నిలిచింది. దీంతో కేంద్రంలో చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ కింగ్ మేకర్లు అయ్యారు.