యూపీలో బీజేపీకి చుక్కలు చూపించిన ఇండియా కూటమి.. 11 నుంచి కాంగ్రెస్ ధన్యవాద్ యాత్ర

Congress announces Dhanyawaad Yatra in UP from 11 to 15th
షార్ట్స్‌లో చూడండి
లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ.. తమను అక్కున చేర్చుకున్న యూపీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి 15 వరకు రాష్ట్రంలోని 403 నియోజకవర్గాల్లో ‘ధన్యవాద్ యాత్ర’ చేపట్టాలని నిర్ణయించింది. సీనియర్ నేతలు, కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొంటారని సమాచారం. 

ఈ యాత్ర సందర్భంగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు రాజ్యాంగ పుస్తకాన్ని బహూకరించి గౌరవిస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 గెలుచుకోగా, మిత్రపక్ష సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది.
Go Back to Shorts
Dhanyawaad Yatra
Congress
Uttar Pradesh
INDIA Bloc

More Telugu News