మరికొద్దిసేపట్లో టీ20 వరల్డ్ కప్లో భారత్కు తొలి మ్యాచ్.. తుది జట్టుపై ఉత్కంఠ!
- తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడనున్న టీమిండియా
- రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం
- కోహ్లీ బ్యాటింగ్ చేయబోయే స్థానంపై అభిమానుల్లో ఆసక్తి
తుది జట్టు ఇదేనా?
ఐర్లాండ్తో మ్యాచ్లో రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ తుది జట్టులో ఆడే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా ఐర్లాండ్తో భారత్ ఆడిన చివరి ఐదు మ్యాచ్ల్లో నాలుగింటిలో విజయాలు సాధించగా ఒక మ్యాచ్లో ఓటమి పాలైంది. నేటి మ్యాచ్లో స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ప్రదర్శనపై అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు.