కేసీఆర్ ప్రజలను ప్రలోభపెట్టి తెలంగాణపై 7 లక్షల కోట్ల భారం మోపారు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకుని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం
- కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర ఉందని విమర్శ
- పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని ఆగ్రహం
పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డు అని ఎద్దేవా చేశారు. బీజేపీ రాముల వారిని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చిందన్నారు. తలంబ్రాల పేరుతో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటోందన్నారు. బీజేపీకి 400 సీట్లిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని హెచ్చరించారు. బీజేపీ నాయకులు నోరు తెరిస్తే అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.