6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు.. దేశీయ విమానరంగంలో సరికొత్త రికార్డు
- పుంజుకుంటున్న దేశీయ విమానయానరంగం
- ఆదివారం సరికొత్త రికార్డు నమోదు
- బద్దలైన గత రికార్డులు
కరోనాకు ముందు ఒక రోజు ప్రయాణికుల సగటు 3,98,579 కాగా, ఇప్పుడు అందుకు 14 శాతం మంది అధికంగా ప్రయాణించారు. నిరుడు ఏప్రిల్ 21న 5,899 విమానాల్లో 4,28,389 మంది ప్రయాణించారు. ఇప్పుడు అంతకుమించి ప్రయాణించారు. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో విమాన ప్రయాణికుల సంఖ్య గతేడాది ఇదే కాలంలో పోల్చితే 375.04 లక్షల నుంచి 391.46 లక్షలకు పెరిగినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది.