YS Sharmila: డీకే శివకుమార్ తో వైఎస్ షర్మిల భేటీ

YS Sharmila meets DK Shivakumar
  • బెంగళూరులోని శివకుమార్ నివాసంలో భేటీ
  • ఎన్నికలపై చర్చించిన డీకే, షర్మిల
  • ప్రచారానికి రావాలని డీకేను కోరిన షర్మిల
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో ఏపీసీసీ చీఫ్ షర్మిల భేటీ అయ్యారు. బెంగళూరులోని శివకుమార్ నివాసంలో వీరి సమావేశం జరిగింది. ఎన్నికలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. ఎన్నికల ప్రచారానికి రావాలని శివకుమార్ ను ఈ సందర్భంగా షర్మిల కోరారు. తాను తప్పకుండా వస్తానని షర్మిలకు శివకుమార్ హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల ద్వారా ఏపీలో ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కమ్యూనిస్టులతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తోంది. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఆమె ఎదుర్కొంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య పోటీ కావడంతో కడప లోక్ సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
YS Sharmila
DK Shivakumar
Congress

More Telugu News