NDA Kutami: విజయవాడలో సమావేశమైన ఎన్డీయే కూటమి నేతలు

  • విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థుల హాజరు
  • అభ్యర్థుల గెలుపు, పార్టీల మధ్య సమన్వయంపై చర్చ
  • జగన్ పై ప్రజలు తిరగబడే పరిస్థితి ఉందన్న సుజనా చౌదరి
NDA Kutami leaders meeting in Vijayawada

ఎన్డీయే కూటమి నేతలు విజయవాడలో సమావేశమయ్యారు. విజయవాడ లోక్ సభ పరిధిలోని అభ్యర్థులందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. 7 అసెంబ్లీ నియోజకర్గాల అభ్యర్థులు, ఇన్ఛార్జ్ లు, జిల్లా పార్టీ అధ్యక్షులు సమావేశంలో పాల్గొన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపుపై, పార్టీల మధ్య సమన్వయం తదితర అంశాలపై వీరు చర్చలు జరిపారు. 

ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ ప్రజల సమస్యలపై ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించుకుంటున్నామని చెప్పారు. సీఎం జగన్ పై ప్రజలు తిరగబడే పరిస్థితులు ఉన్నాయని సుజనా చౌదరి అన్నారు. రాజధానిని నాశనం చేసి, ఈ ప్రాంత అభివృద్ధికి తూట్లు పొడిచారని విమర్శించారు. ప్రజలు తిరగబడే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లడం కూటమితోనే సాధ్యమని చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా ఫేక్ పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

  • Loading...

More Telugu News