చంద్రబాబు ఎవరినైనా గుంజుకోవాలంటే డబ్బు వెదజల్లుతాడు: విజయసాయిరెడ్డి
- చంద్రబాబు మానిప్యులేషన్ల గురించి అందరికీ తెలుసన్న విజయసాయి
- సీటు కావాలంటే వంద కోట్లు చెల్లించాలని ఆరోపణ
- స్థాయిని బట్టి ధర నిర్ణయిస్తాడని వ్యాఖ్యలు
"చంద్రబాబు మానిప్యులేషన్స్ గురించి తెలియనిది ఎవరికి? సీటు కావాలంటే వంద కోట్లు చెల్లించాలి. ఎవరినైనా గుంజుకోవాలంటే డబ్బు వెదజల్లుతాడు. అది ఏడు కోట్లా, ఇరవై కోట్లా అనేది స్థాయిని బట్టి ధర నిర్ణయిస్తాడు. బుకాయింపులు వద్దు. చంద్రబాబు హాట్ డీల్స్ ఎలా ఉంటాయో పసివాడిని అడిగినా చెబుతారు వొంటేరూ" అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.
అంతకుముందు, విజయసాయి మీడియాతో మాట్లాడుతూ, నెల్లూరు లోక్ సభ స్థానంలో టీడీపీకి అభ్యర్థి దొరక్క తమ పార్టీ నుంచి తీసుకున్నారని ఎద్దేవా చేశారు. నెల్లూరు బరి నుంచి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.