TDP: 34 మందితో రెండో జాబితా విడుదల చేసిన తెలుగుదేశం

TDP releases second list with 34 candidates
షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీ 34 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది. రాజమండ్రి రూరల్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దక్కించుకోగా, గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసిన గాజువాకలో ఈసారి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు టికెట్ దక్కించుకున్నారు. దెందులూరు నుంచి మరోసారి చింతమనేని ప్రభాకర్ కే అవకాశం ఇచ్చారు. 

గురజాల నుంచి యరపతినేని శ్రీనివాసరావు బరిలో దిగుతుండగా, వైసీపీ నుంచి టీడీపీ వైపునకు మరలిన ఆనం రామనారాయణరెడ్డిని ఆత్మకూరు అభ్యర్థిగా ప్రకటించారు. ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అర్ధాంగి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కోవూరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు.

ఇక, ప్రకాశం జిల్లాలో గత కొంతకాలంగా కాంగ్రెస్ కు, ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా మారిన కందుకూరు నియోజకవర్గం నుంచి ఇంటూరి నాగేశ్వరరావు ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. 

మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డి (బాబు) టికెట్ దక్కించుకున్నారు. అంతేకాదు, వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు అదే స్థానం నుంచి టీడీపీ టికెట్ కేటాయించింది.

రెండో జాబితాలో 34 మంది పేర్లను ప్రకటించగా, అందులో 27 మంది పురుషులు, ఏడుగురు మహిళలు. అందులో పదో తరగతి, అంతకంటే తక్కువ చదివినవాళ్లు ఐదుగురు ఉన్నారు. ఒకరు పీహెచ్ డీ, 11 మంది పీజీ, 9 మంది గ్రాడ్యుయేషన్, 8 మంది ఇంటర్ చదివిన వారు ఉన్నారు. 

ఇక, వయసు చూస్తే... 61 నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న వారు ముగ్గురు ఉండగా... అత్యధికంగా 46 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారు 19 మంది ఉన్నారు. 

తొలి జాబితాలో టీడీపీ 94 మంది పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండో జాబితాతో కూడా కలిపి ఇప్పటివరకు 128 మందిని ప్రకటించినట్టయింది. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు... బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు 6 ఎంపీ స్థానాలు కేటాయించారు. 
Go Back to Shorts
TDP
Second List
Assembly
Andhra Pradesh

More Telugu News