నగరిలో తన వ్యతిరేక వర్గీయులపై నిప్పుల చెరిగిన రోజా
- తిరుపతిలో ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్న రోజా
- పార్టీ క్యాడర్ ను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని మండిపాటు
- అందరికీ బుద్ధి చెప్పే సమయం ఆసన్నమయిందని వ్యాఖ్య
నగరిలో మాట్లాడే ధైర్యం లేక తిరుపతిలో కూర్చొని మాట్లాడుతూ నగరి పరువు తీస్తున్నారని అన్నారు. పార్టీ క్యాడర్ ను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు. వీళ్లందరికీ బుద్ధి చెప్పే సమయం ఆసన్నమయిందని అన్నారు. ప్రతిపక్షాలతో పోరాడుతూ జగనన్న ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తున్నారని... అదే విధంగా నగరిలో తాను కూడా వెన్నుపోటు దారులతో పోరాటం చేస్తూనే ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధిని అందిస్తున్నానని చెప్పారు.