మరో ఐదు రోజులు మండే ఎండలే.. హైదరాబాదీలకు అలర్ట్
- ఫిబ్రవరి చివరి నుంచే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- ఈ నెల 7 వరకూ ఎండలు మాడ్చేస్తాయన్న వాతావరణ శాఖ
- 37 డిగ్రీల నుంచి 40 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుందని హెచ్చరిక
గురువారం వరకు పగటి పూట 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో రాత్రి వేళల్లోనూ సాధారణ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పారు. వారం రోజులుగా ఎండల తీవ్రతకు నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. మార్చి మొదటి వారంలోనే ఇలా ఉంటే ముందు ముందు ఎండల తీవ్రత ఎలా ఉండనుందోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.