జగన్ అక్రమాస్తుల విచారణ కేసు వాయిదా
- డిశ్చార్జి పిటిషన్లపై సుదీర్ఘకాలంగా విచారణ
- 2 నెలల్లో ముగించాలని గత డిసెంబర్ లో సీబీఐ కోర్టుకు ఆదేశం
- ఈ గడువును తాజాగా ఏప్రిల్ 30 వరకు పొడిగించిన తెలంగాణ హైకోర్టు
ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులపై విచారణ జరిగిన సమయంలో జగన్ కు సంబంధించిన 20 కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లను 2 నెలల్లో ముగించాలని డిసెంబరు 15న సీబీఐ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుల్లో పెద్ద సంఖ్యలో ఉన్న రికార్డులను పరిశీలించాలని, సాక్షుల వాంగ్మూలాలు సేకరించాలని సీబీఐ కోర్టు పేర్కొంది. విచారణ తుది దశకు చేరిందని, సుమారు 13వేల పేజీల డిక్టేషన్ సిద్ధంగా ఉందని సీబీఐ కోర్టు తెలిపింది. మరికొంత సమయం కావాలని కోరడంతో తెలంగాణ హైకోర్టు అనుమతించింది.