తనపేరు వేయలేదని.. శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వైసీపీ సర్పంచి
- ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో ఘటన
- అభివృద్ధి పనుల శిలాఫలకాలపై లేని సర్పంచి పేరు
- తనను గౌరవించలేదని సర్పంచి ఆగ్రహం
దీనిపై రామాంజనేయరెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వైసీపీలో ఉన్న ఓ వర్గం నాయకులకు అధికారులు తలొగ్గి తన పేరును రాయలేదని మండిపడ్డారు. నాయకులు, అధికారుల పేర్లను రాసి... సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న తన పేరును రాయలేదని విమర్శించారు. సుత్తితో శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. తనను గౌరవించకపోవడంతో బాధతో ఈ పని చేశానని చెప్పారు.