నాలుగవ టెస్ట్ మ్యాచ్కు ఆతిథ్యమివ్వనున్న రాంచీ మైదానంలో రికార్డులు ఇవే!
- రాంచీ జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్లో ఇప్పటివరకు 2 మ్యాచ్ లు ఆడిన భారత్
- దక్షిణాఫ్రికాపై విక్టరీ.. ఆస్ట్రేలియాపై మ్యాచ్ డ్రా
- భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగవ టెస్టులో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ
ఇక రాంచీలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్నది మొత్తం మీద చూస్తే మూడవ టెస్ట్ మ్యాచ్ కానుంది. అంతకుముందు రాంచీ మైదానంలో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే జరిగాయి. ఈ రెండింట్లో ఒక మ్యాచ్లో భారత్ గెలవగా.. మరో మ్యాచ్ డ్రా అయ్యింది. 2017లో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయ్యింది. 2019లో ఇదే మైదానంలో దక్షిణాఫ్రికాపై భారత్ 202 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీనిని బట్టి చూస్తే రాంచీ మైదానంలో టీమిండియా గణాంకాలు సానుకూలంగానే ఉన్నాయని చెప్పాలి.
కాగా రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏకంగా 434 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. మొదటి ఇన్నింగ్స్లో సెంచరీతో పాటు రెండవ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన రవీంద్ర జడేజాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కిన విషయం తెలిసిందే.