ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ నేత మల్లు రవి
- డప్పు వాయిద్యాలతో తెలంగాణ భవన్లోకి ఆహ్వానం
- సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని వ్యాఖ్య
- ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా అవకాశమిచ్చిన ఏఐసీసీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ సీనియర్
సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మల్లు రవి అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన 15 అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విన్నవించారని ప్రస్తావించారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని గుర్తుచేశారు.