భారత్తో దౌత్య వివాదం.. మాల్దీవుల అధ్యక్షుడికి మరో ఎదురుదెబ్బ
- మాలే నగర మేయర్ ఎన్నికల్లో భారత అనుకూల ఎమ్డీపీ పార్టీ విజయం
- అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్పై ఎమ్డీపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపు
- భారత్తో దౌత్య వివాదం నేపథ్యంలో ఓటమి చవిచూసిన అధికార పార్టీ
మాలే మేయర్ ఎన్నికల్లో ఎమ్డీపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందారని స్థానిక మీడియా చెప్పింది. ఆయన విజయం నల్లేరు మీద నడకేనని వ్యాఖ్యానించింది. కాగా, ఈ విజయంతో ప్రతిపక్ష ఎమ్డీపీకి మంచి ఊపు నిస్తుందని అక్కడి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
లక్షద్వీప్ పర్యటన అనంతరం ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలతో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామంపై భారత్లో తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో నష్టనివారణ చర్యలకు దిగిన అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జు ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించారు. ఆ తరువాత చైనా పర్యటనకు వెళ్లి తిరిగొచ్చిన అధ్యక్షుడు ముయిజ్జు మాలే ఎన్నికల్లో ఓటమి వార్త వినాల్సి వచ్చింది.