ముషీరాబాద్‌ బీఆర్ఎస్ అభ్యర్థి కుమారుడి అరెస్ట్!

  • బీఆర్ఎస్ నేత ముఠాగోపాల్ కుమారుడు జయసింహ ఓటర్లకు డబ్బు పంచుతుండగా అరెస్ట్
  • పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విక్రంరెడ్డి పైనా కేసు నమోదు
  • తనపై విక్రంరెడ్డి దాడి చేశారని లక్కదొడ్డికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో నమోదైన కేసు
ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ కుమారుడు జయసింహను పోలీసులు అరెస్టు చేశారు. ఓటర్లకు డబ్బులు పంచుతుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విక్రంరెడ్డిపై కూడా కేసు నమోదైంది. తనపై దాడి చేశారని విక్రంరెడ్డిపై లక్కదొడ్దికి చెందిన ప్రవీణ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.


More Telugu News

Telangana Assembly Election Musheerabad Hyderabad BRS