ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కుమారుడి అరెస్ట్!
ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ కుమారుడు జయసింహను పోలీసులు అరెస్టు చేశారు. ఓటర్లకు డబ్బులు పంచుతుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విక్రంరెడ్డిపై కూడా కేసు నమోదైంది. తనపై దాడి చేశారని విక్రంరెడ్డిపై లక్కదొడ్దికి చెందిన ప్రవీణ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.