Narendra Modi: హైదరాబాదులో ప్రధాని నరేంద్రమోదీ రోడ్డు షో... రెండు మెట్రో రైల్వే స్టేషన్ల మూసివేత

హైదరాబాదులో ప్రధాని నరేంద్రమోదీ రోడ్డు షో నేపథ్యంలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగా రెండు మెట్రో స్టేషన్‌లను ఈ రోజు సాయంత్రం మూసివేయనున్నారు. నేటి మధ్యాహ్నం ప్రధాని మోదీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి వెంకటేశ్వరస్వామి ఆర్చ్, ఓల్డ్ వైఎంసీఏ పోలీస్టేషన్ మీదుగా కాచిగూడలోని వీరసావర్కర్ విగ్రహం వరకు రోడ్డు షోలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో రోడ్డు షో జరగనున్న చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.
Narendra Modi
metro
Telangana Assembly Election
BJP

More Telugu News