తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారంపై బొత్స సత్యనారాయణ విమర్శలు
- చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు అన్న పోచారం
- పోచారం వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్న బొత్స
- ఒక రిమాండ్ ఖైదీ గురించి ఇలా మాట్లాడొచ్చా అని ప్రశ్న
పోచారం వ్యాఖ్యలు వైసీపీ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. పోచారం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజ్యాంగ పదివిలో ఉంటూ చంద్రబాబు అరెస్ట్ సరికాదన్న పోచారం వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. రిమాండ్ లో ఉన్న ఒక ఖైదీ గురించి ఇలా మాట్లాడొచ్చా? అని ప్రశ్నించారు. మీ సీఎం కేసీఆర్ ను అడిగితే ఆయనే చెపుతారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మాట్లాడొచ్చని, కానీ వ్యవస్థలను తాకట్టు పెట్టేలా మాత్రం మాట్లాడకూడదని చెప్పారు. ప్రజా జీవితంలో ఉన్నవారు అవినీతి రహితంగా పాలన చేయాలని అన్నారు.