ఇంకెంతో కాలం నీ ఆటలు సాగవ్ బాబూ!: విజయసాయిరెడ్డి
- అడ్డంగా దొరికినా అడ్డగోలుగా బుకాయించే వ్యక్తి చంద్రబాబు అని విమర్శ
- ఓటుకు నోటు కేసులోను దొరికిపోయారన్న వైసీపీ ఎంపీ
- 2001లోనే చంద్రబాబు అవినీతి బాగోతాన్ని తెహల్కా బయటపెట్టిందని వ్యాఖ్య
రూ.118 కోట్ల కమీషన్ పై ఇక్కడున్న ఐటీ ఆఫీస్ నోటీసు ఇవ్వకుండా సెంట్రల్ ఆయకార్ భవన్ ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించడం విడ్డూరమన్నారు. ఓటుకు నోటు కేసులోనూ అలాగే చేశారని ధ్వజమెత్తారు. 2001లోనే తెహల్కా సంస్థ చంద్రబాబు అవినీతి బాగోతాన్ని బయటపెట్టిందన్నారు. కానీ ఇంకెంతో కాలం చంద్రబాబు ఆటలు సాగవని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.