2bhk houses: హైదరాబాద్ పేదలకు కేటీఆర్ శుభవార్త.. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు
హైదరాబాద్ మహానగరంలో పేదలకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. నగరంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులైన పేదలకు పంచుతామని తెలిపారు. ఈ నెల 15 నుంచి అక్టోబరులోగా లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేయబోతున్నామని ఆయన ఈ రోజు ప్రకటించారు. నియోజకవర్గానికి 4వేల చొప్పున ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు.
గృహలక్ష్మీ పథకం కింద నియోజకవర్గానికి మూడు వేల కుటుంబాలకు నగదు సాయం అందిస్తామని చెప్పారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ ప్రకటన చేశారు. ఎల్బీ నగర్లో జీవో నెం.118 కింద రెగ్యులరైజ్ చేసిన పట్టాలను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఒక్క ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే 4 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు, గృహలక్ష్మీ పథకం కింద 3 వేల ఇళ్లు వస్తాయని తెలిపారు.
గృహలక్ష్మీ పథకం కింద నియోజకవర్గానికి మూడు వేల కుటుంబాలకు నగదు సాయం అందిస్తామని చెప్పారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ ప్రకటన చేశారు. ఎల్బీ నగర్లో జీవో నెం.118 కింద రెగ్యులరైజ్ చేసిన పట్టాలను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఒక్క ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే 4 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు, గృహలక్ష్మీ పథకం కింద 3 వేల ఇళ్లు వస్తాయని తెలిపారు.