నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

markets ends in losses
  • 106 పాయింట్లు పడిన సెన్సెక్స్
  • 13 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 4 శాతం వరకు లాభపడిన ఎన్టీపీసీ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాలను చవి చూశాయి. అమెరికా మార్కెట్లు బలహీనంగా ఉండటం మన మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 106 పాయింట్లు నష్టపోయి 66,160కి పడిపోయింది. నిఫ్టీ 13 పాయింట్లు కోల్పోయి 19,646 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.96%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.05%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.43%), బజాజ్ ఫైనాన్స్ (1.35%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (1.29%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-1.75%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.72%), టాటా మోటార్స్ (-1.66%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.27%), టీసీఎస్ (-1.20%).
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News