కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే బండి సంజయ్ని తప్పించారు: వీహెచ్
- బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న కాంగ్రెస్ సీనియర్ నేత
- బీఆర్ఎస్ కచ్చితంగా బీజేపీకి బీ-టీమ్ అని ఆరోపణ
- దేశంలో రాహుల్ గాంధీ హవా నడుస్తుందని వ్యాఖ్య
కర్ణాటకలో బీసీలు, మైనార్టీలు కాంగ్రెస్ పక్షాన నిలిచారని, అందుకే భారీ విజయం దక్కిందన్నారు. బీసీ గర్జన పేరుతో తమ బలం చూపిస్తామని, తమ డిమాండ్లు అధిష్ఠానం ముందు పెడతామని చెప్పారు. తమ బలాన్ని చూపిస్తే అగ్ర నాయకులు ఒప్పుకుంటారన్నారు. తాము అగ్రకులాల నాయకులకు వ్యతిరేకం కాదని, కానీ తమ డిమాండ్ పాత వారికీ.. బీసీలకు స్థానం కల్పించాలన్నారు. కనీసం 40 శాతం సీట్లు బీసీలకు ఇవ్వాలన్నారు. బీసీలు గతంలో అవమానాలు భరించారని, ఇప్పుడాపరిస్థితి లేదన్నారు.