విడిపోతున్నారని ప్రచారం.. పూజలో పాల్గొన్న పవన్ కల్యాణ్ దంపతుల ఫొటోతో చెక్
- పవన్ - అనా ఫొటోతో ప్రచారానికి చెక్ పెట్టిన జనసేన
- వారాహి తొలి దశ విజయవంతమైన నేపథ్యంలో హైదరాబాద్ లో పూజ
- త్వరలో తదుపరి వారాహి దశ విజయయాత్ర
'జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు - వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొన్ని రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో మంగళగిరి చేరుకుంటారు' అని పోస్ట్ పెట్టింది.