మార్గదర్శి కేసు: రామోజీరావు, శైలజా కిరణ్‌లకు సీఐడీ నోటీసులు

  • 41ఏ కింద నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడీ
  • గుంటూరులోని రీజినల్ కార్యాలయానికి జులై 5న విచారణకు రావాలని ఆదేశం
  • ఈ నెల మొదటి వారంలో శైలజా కిరణ్ విచారణ
మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో నిందితులుగా ఉన్న రామోజీ రావు, శైలజా కిరణ్ లకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 41ఏ కింద నోటీసులు ఇచ్చి, జులై 5న గుంటూరులోని సీఐడీ రీజినల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో రామోజీ రావు ఏ1గా, శైలజా కిరణ్ ఏ2గా ఉన్నారు. ఈ నెల మొదటివారంలో ఏ2 శైలజా కిరణ్ ను ఆమె నివాసంలోనే సీఐడీ విచారించింది.

Andhra Pradesh
cid

More Telugu News