USA: ఉద్యోగులకు పెద్ద పార్టీ.. ఆ తరువాత వారి కొంప ముంచిన సంస్థ!

A cybersecurity company throws a party with branded drinks and then fires 13 per cent of its workforce
షార్ట్స్‌లో చూడండి
అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ బిషప్ ఫాక్స్ ఇటీవల అనూహ్య రీతిలో ఉద్యోగులను తొలగించింది. తొలుత సంస్థలో ఉద్యోగులందరికీ యాజమాన్యం పెద్ద పార్టీ ఇచ్చింది. సైబర్ సూప్ పేరిట పార్టీ ఏర్పాటు చేసిన ఈ పార్టీలో ఉద్యోగులకు ఖరీదైన బ్రాండెడ్ మద్యాన్ని ఇచ్చింది. ఆ మరుసటి రోజున 50 మందిని తొలగించబోతున్నట్టు ప్రకటించేసింది. సంస్థ మొత్తం ఉద్యోగుల్లో వీరి వాటా సుమారు 13 శాతం. 

తమను ఇలా ఉద్యోగంలోంచి తీసేస్తారని అస్సలు ఊహించలేదని కొందరు సోషల్ మీడియా వేదికగా వాపోయారు. సంస్థ అంతర్గత మార్పుల్లో భాగంగా ఈ తొలగింపులు జరిగాయని మరికొందరు అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక రంగంపై నీలినీడలు కమ్ముకుంటున్న కారణంగానే ఉద్యోగులను తీసేసేందుకు నిర్ణయించినట్టు బిషప్ ఫాక్స్ పేర్కొంది. ప్రస్తుతం సంస్థ వ్యాపారం స్థిరంగానే ఉన్నప్పటికీ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొందని సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, గతంలో సంస్థ అవసరానికి మించి ఉద్యోగులను నియమించుకోవడంతో ప్రస్తుతం తొలగింపులు చేపట్టాల్సి వచ్చిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వ్యాఖ్యానించాయి.
Go Back to Shorts
USA

More Telugu News