Pawan Kalyan: రాజధాని రైతులకు మద్దతిస్తే దాడి చేస్తారా?: పవన్ కల్యాణ్

Pawan Kalyan condemns attack on BJP leader Sathya Kumar car
  • అమరావతి ప్రాంతంలో బీజేపీ నేత సత్యకుమార్ కారుపై దాడి
  • తీవ్రంగా ఖండించిన పవన్ కల్యాణ్
  • బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణించాలని సూచన
  • దాడిపై కేంద్రం సమగ్ర విచారణ చేపట్టాలన్న జనసేనాని

ఉద్ధండరాయునిపాలెం వద్ద బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కారుపై దాడి జరగడం పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రాజధాని రైతులకు మద్దతిస్తే దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేత సత్యకుమార్ పై దాడి సరికాదని తెలిపారు. 

ఈ దాడి ఘటనను బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణించాలని సూచించారు. దాడి ఘటనపై కేంద్రం సమగ్ర విచారణ చేపట్టాలని పవన్ తెలిపారు. వైసీపీ దౌర్జన్యాలను కేంద్రం దృష్టికి తీసుకెళతామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News