ఉగాది నాడు తెలుగు కుటుంబాలు శోభాయమానం కావాలి: పవన్ కల్యాణ్
- రేపు ఉగాది
- ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
- మన పండుగలన్నీ ప్రకృతితో పెనవేసుకున్నవేనని వెల్లడి
ఉగాది నాడు తెలుగు కుటుంబాలు శోభాయమానం కావాలని ఆకాంక్షించారు. మన పండుగలన్నీ ప్రకృతితో పెనవేసుకున్నవేనని, అందుకే మన పండుగలకు అంత శోభ చేకూరుతుందని వివరించారు. సంక్రాంతి నాటికి పంట చేతికందితే, ఉగాదితో వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.
ఈ తెలుగు సంవత్సరం ప్రజలకు ఆరోగ్యం, సిరిసంపదలు ప్రసాదించాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ముందస్తు సందేశం వెలువరించారు.