ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితులకు సీబీఐ కోర్టులో చుక్కెదురు
- బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన సీబీఐ కోర్టు
- ఇప్పటికే పలువురి ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
- రూ. 2,873 కోట్ల స్కామ్ జరిగిందన్న ఈడీ అధికారులు
మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఆప్ నేత విజయ్ నాయర్, వ్యాపారవేత్త సమీర్ మహేంద్రు ఇళ్లను ఈడీ అటాచ్ చేసింది. దీంతో పాటు దినేశ్ అరోరాకు చెందిన రెస్టారెంట్ ను, అమిత్ అరోరాకు చెందని ఆస్తులను కూడా అటాచ్ చేసింది. సమీర్ మహేంద్రుకు చెందిన రూ. 35 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో రూ. 2,873 కోట్ల స్కామ్ జరిగిందని... ఇప్పటి వరకు రూ. 76.54 కోట్ల నగదును పట్టుకున్నామని ఈడీ అధికారులు తెలిపారు.