కరోనా టీకాల కొనుగోళ్లను నిలిపివేసిన కేంద్రం
- బడ్జెట్ లో 85 % నిధులు ఆర్థిక శాఖకు వాపస్
- వచ్చే ఆరు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రకటన
- మార్కెట్లో కూడా దొరుకుతున్నాయని వెల్లడి
ఇప్పుడు నిల్వ ఉన్న డోసులు మరో ఆరు నెలల వరకు సరిపోతాయని, ఆ తర్వాత పరిస్థితిని బట్టి వ్యాక్సిన్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వివరించింది. బయట మార్కెట్లోనూ కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. వ్యాక్సిన్ల కొనుగోలు కోసం ఈ ఏడాది వైద్యశాఖకు కేటాయించిన రూ. 5 వేల కోట్లలో 4,237.14 కోట్లను తిరిగి తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈమేరకు వైద్యశాఖ నుంచి ఆర్థిక శాఖకు నిధుల బదిలీ కూడా పూర్తయినట్లు సమాచారం.