విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థికే టీఆర్ఎస్ మద్దతు.. రేపే పోలింగ్!
- మార్గరెట్ ఆల్వాకే మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ నిర్ణయం
- ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ
- టీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు కలిపి 16 మంది ఎంపీలు ఈ మేరకు ఓటు వేయాలని సూచన
మొత్తం 788 మంది ఎంపీలు..
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10వ తేదీన పూర్తికానుంది. ఈ మేరకు ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ఆగస్టు 6న పోలింగ్ జరుగనుంది. ఇందులో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే తరఫున జగదీప్ ధన్ కర్ పోటీ చేస్తుండగా.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో లోక్ సభ, రాజ్యసభ సభ్యులు మొత్తం 788 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.