నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం.. యంగ్ ఇండియా కార్యాలయాన్ని సీజ్ చేసిన ఈడీ
- నేషనల్ హెరాల్డ్ ప్రధాన కార్యాలయంలోనే యంగ్ ఇండియా ఆఫీస్
- రెండు రోజుల సోదాల అనంతరం కార్యాలయాన్ని సీజ్ చేసిన వైనం
- ఏఐసీసీ కార్యాలయం, సోనియా, రాహుల్ నివాసాల వద్ద భారీగా మోహరించిన పోలీసులు
ఈడీ తీసుకున్న ఈ చర్యతో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం (ఏఐసీసీ) పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఫలితంగా ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లే దారులన్నీ మూసుకుపోయాయి. అదే సమయంలో యంగ్ ఇండియా ప్రమోటర్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నివాసం వద్ద కూడా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. వెరసి ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.