భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits
  • 760 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 229 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4.36 శాతం లాభపడ్డ ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. టెక్నాలజీ, బ్యాంకింగ్, మెటల్ సూచీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి. ఈరోజు ఏసియన్ మార్కెట్లు పాజిటివ్ గానే ట్రేడ్ అయ్యాయి. వీటి ప్రభావం మన మార్కెట్లపై కూడా పడింది. ఉదయం నుంచి మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 760 పాయింట్లు లాభపడి 54,521కి చేరుకుంది. నిఫ్టీ 229 పాయింట్లు పెరిగి 16,278కి ఎగబాకింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.36%), ఇన్ఫోసిస్ (4.16%), టెక్ మహీంద్రా (3.67%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.46%), యాక్సిస్ బ్యాంక్ (3.31%).

టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ (-1.70%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.19%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.86%), మారుతి (-0.84%), నెస్లే ఇండియా (-0.76%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News