ముంబయిలో కుప్పకూలిన భవనం... 18కి పెరిగిన మృతుల సంఖ్య

Death toll rises in Mumbai building collapse
  • ముంబయిలో భారీ వర్షాలు
  • కుర్లా ప్రాంతంలో ఘటన
  • కూలిపోయిన నాలుగంతస్తుల భవనం
ముంబయిలోని కుర్లా ప్రాంతంలో ఓ భవనం గతరాత్రి కుప్పకూలింది. ఈ ఘటనలో మృతి చెందినవారి సంఖ్య ప్రస్తుతం 18కి పెరిగింది. క్షతగాత్రులకు రాజావాడి, సియాన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. గత కొన్నిరోజలుగా ముంబయి నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుర్లా ప్రాంతంలోని ఓ స్లమ్ ఏరియాలో ఉన్న నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. 

శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీసేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో 20 మంది గాయపడగా, వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. కాగా, కూలిపోయిన భవనాన్ని ఆనుకుని ఉన్న భవనాల పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉన్నట్టు గుర్తించారు.
Go Back to Shorts
Building Collapse
Kurla
Mumbai
Death Toll

More Telugu News