డాక్టర్ సుందరనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు

పౌల్ట్రీ రంగ దిగ్గజం, బాలాజీ హేచరీస్ అధినేత డాక్టర్ సుందరనాయుడు (85) కొన్నిరోజుల కిందట కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, చిత్తూరులో సుందరనాయుడు నివాసానికి చంద్రబాబు నేడు విచ్చేశారు. సుందరనాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుందరనాయుడు కుమార్తె శైలజా కిరణ్, ఆయన అల్లుడు 'ఈనాడు' కిరణ్ (రామోజీరావు కుమారుడు)లతో మాట్లాడారు.


More Telugu News