Chandrababu: తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో చంద్రబాబు పర్యటన నేటి షెడ్యూల్ ఇదే.. రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్న టీడీపీ అధినేత!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనల్లో బిజీగా గడుపుతున్నారు. ప్రజలతో మమేకమవుతూ, టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఆయన పర్యటన తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో కొనసాగనుంది. 

మరోవైపు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవులో బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. 

చంద్రబాబు ఈనాటి పర్యటన షెడ్యూల్ వివరాలు:

  • ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా కీలక నేతలతో భేటీ
  • 11 గంటలకు ప్రత్తిపాడు, తుని కార్యకర్తలతో సమావేశం
  • 11.30 గంటలకు చంద్రబాబు సమక్షంలో బొడ్డు వెంకటరమణ చౌదరి టీడీపీలో చేరే కార్యక్రమం
  • మధ్యాహ్నం 12.30 గంటలకు అన్నవరంలో మీడియా సమావేశం
  • ఆ తర్వాత కత్తిపూడి, గొల్లప్రోలు, కాకినాడ భానుగుడి సెంటర్ లో ప్రసంగం
  • మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తాళ్లరేవు మండలం మాధవరాయుని పేటలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు. అనంతరం స్థానికులతో సహపంక్తి భోజనం చేయనున్న బాబు
  • ఆ తర్వాత రామవరంకు వెళ్లి అనారోగ్యంతో బాధపడుతున్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డికి పరామర్శ
  • రాత్రికి రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాదుకు పయనం.
Chandrababu
District Tours
Telugudesam

More Telugu News