RTC: హైదరాబాద్ లో మెట్రో పిల్లర్ ను ఢీకొట్టిన సిటీ బస్సు

హైదరాబాద్ లోని మలక్ పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. మలక్ పేట కూడలి వద్ద మెట్రో పిల్లర్ ను సిటీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ఘటనతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై ఆరా తీశారు. ప్రమాదానికి కారణాలేంటన్నది తెలియరాలేదు.
RTC
TS RTC
Bus
Road Accident
Hyderabad

More Telugu News