చంద్రబాబు త్వరగా కోలుకోవాలి: చైనా రాయబారి లేఖ

టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు ఆకాంక్షించారు. తాజాగా చంద్రబాబుకు భారత్ లోని చైనా రాయబారి సున్ వెయిడాంగ్ లేఖ రాశారు. కరోనా నుంచి చంద్రబాబు త్వరగా కోలుకోవాలని లేఖలో ఆయన ఆకాంక్షించారు. మరోవైపు చంద్రబాబు హోం ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆయనలో కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ఆయన తర్వగా కోలుకోవాలని టీడీపీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నాయి.

Chandrababu
Telugudesam
Corona Virus
Chinna Ambassador

More Telugu News