మూడో టెస్టులో టీమిండియా ఓటమి... సిరీస్ దక్షిణాఫ్రికా కైవసం
- కేప్ టౌన్ లో మూడో టెస్టు
- 7 వికెట్ల తేడాతో నెగ్గిన దక్షిణాఫ్రికా
- 212 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించిన వైనం
- సిరీస్ 2-1తో చేజిక్కించుకున్న సఫారీలు
ఈ సిరీస్ లో తొలి టెస్టును టీమిండియా నెగ్గిన తీరు చూస్తే, మిగతా టెస్టుల్లోనూ ఎదురుండదనిపించింది. అయితే, అనూహ్య రీతిలో దక్షిణాఫ్రికన్లు పుంజుకుని భారత్ పై ఎదురుదాడి చేశారు. వరుసగా రెండు టెస్టుల్లో నెగ్గి సిరీస్ విజేతగా అవతరించారు. అటు, దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించాలని భావించిన టీమిండియాకు ఆశాభంగం తప్పలేదు.