అందరూ సంక్రాంతి జరుపుకుంటుంటే, ఆ ఇంట్లో చీకట్లు కమ్ముకున్నాయి: వ‌ర్ల రామ‌య్య‌

varlaramaiah slams jagan
  • ముఖ్య‌మంత్రి గారూ.. మీ పాలనలో హత్యారాజకీయాలు పెరిగిపోతున్నాయి
  • అధికారపార్టీ అహంకారానికి ఒక కుటుంబం పల్నాడులో బలైంది
  • ప్రశాంతంగా వుండే గ్రామాలను రాజకీయ కక్షా కేంద్రాలుగా మార్చారు
  • ఇదేనా రాజన్న రాజ్యం, మీరే ఆలోచించండి  
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట చంద్రయ్య (36) దారుణ హత్యకు గురయిన విష‌యం తెలిసిందే. సంక్రాంతి ముందే ఇటువంటి ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో దీనిపై టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య కూడా తీవ్రంగా స్పందించారు.

'ముఖ్యమంత్రి గారూ... మీ పాలనలో హత్యా రాజకీయాలు పెరిగి పోతున్నాయి. అధికార పార్టీ అహంకారానికి ఒక కుటుంబం పల్నాడులో బలైంది. అందరూ సంక్రాంతి జరుపుకుంటుంటే, ఆ ఇంట్లో చీకట్లు కమ్ముకున్నాయి. ప్రశాంతంగా వుండే గ్రామాలను రాజకీయ కక్షా కేంద్రాలుగా మార్చారు. ఇదేనా రాజన్న రాజ్యం, మీరే ఆలోచించండి' అని వ‌ర్ల రామ‌య్య ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Varla Ramaiah
Telugudesam
YS Jagan

More Telugu News