Andhra Pradesh: మందుబాబులకు సంతోషకర వార్తను చెప్పిన ఏపీ ప్రభుత్వం.. అర్ధరాత్రి వరకు అమ్మకాలు!

  • న్యూఇయర్ సందర్భంగా గుడ్ న్యూస్
  • వైన్ షాపులు, బార్ల సమయం పొడిగింపు
  • అర్ధరాత్రి వరకు ఈవెంట్లు, పర్యాటక అనుమతులు పొందిన హోటళ్లలో మద్యం అమ్మకాలు
AP Govt extends liquor sales time on new year

న్యూఇయర్ సెలెబ్రేషన్లకు అందరూ సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో మందుబాబులకు ఏపీలోని వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైన్ షాపులు, బార్ల సమయాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. రెగ్యులర్ సమయం కంటే మరో గంటసేపు సమయాన్ని పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అర్ధరాత్రి వరకు ఈవెంట్స్ తో పాటు, పర్యాటక లైసెన్సులు పొందిన హోటళ్లలో మద్యం అమ్మకాలకు అనుమతిని ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.  

More Telugu News