వివేకా హత్య కేసులో సీబీఐ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది: వర్ల రామయ్య

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుండడం తెలిసిందే. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. వివేకా హత్య కేసులో సీబీఐ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుందని వ్యాఖ్యానించారు. జైళ్ల శాఖ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే జైల్లో ఉన్న ముద్దాయిలను ఎప్పుడంటే అప్పుడు జైల్లో నుంచి బయటికి తీసుకురావొచ్చని తెలిపారు. "ముద్దాయిలు ఆసుపత్రిలో ఏసీ రూంలో ఉండొచ్చు... వారు అన్ని సుఖాలు అనుభవించే వీలుంటుంది... తస్మాత్ జాగ్రత్త సీబీఐ" అని పేర్కొన్నారు.

Varla Ramaiah
YS Vivekananda Reddy
Case
CBI
Andhra Pradesh

More Telugu News