విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్
- జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా వ్యాప్తి
- గుజరాత్ లోని జామ్ నగర్ లో గుర్తింపు
- దేశంలో 25కు పెరిగిన ఒమిక్రాన్ కేసులు
ఆ వ్యక్తి కాంటాక్ట్స్ లోనే ఈ ఇద్దరికి ఇవాళ ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే పాజిటివ్ వచ్చిన జింబాబ్వే వ్యక్తిని కలిసిన పది మందిని క్వారంటైన్ లో పెట్టారు. ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో బూస్టర్ డోసుపైనా చర్చ జరుగుతోంది. అవసరముంటే బూస్టర్ డోస్ కూడా తీసుకోవచ్చని, అయితే, సెకండ్ డోసు తీసుకున్న 9 నెలల తర్వాతే తీసుకోవాలని ఆరోగ్యశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు.