Corona Virus: తెలంగాణలో కొత్తగా 187 మందికి కరోనా పాజిటివ్

Corona positive for 187 newcomers in Telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 39,161 కరోనా పరీక్షలు నిర్వహించగా, 187 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 62 కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 18, నల్గొండ జిల్లాలో 12, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11, రంగారెడ్డి జిల్లాలో 10 కేసులు వెలుగు చూశాయి. వనపర్తి, నిర్మల్, నారాయణపేట, ములుగు, కొమురం భీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 170 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,67,158 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,58,827 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,406 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,925కి పెరిగింది.


Go Back to Shorts
Corona Virus
Telangana

More Telugu News