టీమిండియా కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్... ఐసోలేషన్ లో సహాయక సిబ్బంది
- ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న టీమిండియా
- మరోసారి కరోనా కలకలం
- రవిశాస్త్రికి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు
- ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేపట్టిన మేనేజ్ మెంట్
రవిశాస్త్రికి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆర్టీ-పీసీఆర్ టెస్టు కూడా నిర్వహించారు. ఈ టెస్టు ఫలితం వచ్చేవరకు ఆయనను ఐసోలేషన్ లో ఉంచనున్నారు. అయితే టీమిండియా ఆటగాళ్లలో ఎవరూ కరోనా బారినపడలేదని, ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టుకు ఎలాంటి ఆటంకాలు లేవని మేనేజ్ మెంట్ స్పష్టం చేసింది. రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆటగాళ్లకు, సహాయక సిబ్బంది మొత్తానికి ర్యాపిడ్ యాంటీజెన్, ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించారు.