'వలిమై'లో మనసును కదిలించే మదర్ సెంటిమెంట్!
- అజిత్ తాజా చిత్రంగా 'వలిమై'
- హెచ్ వినోద్ తో రెండవ సినిమా
- కథానాయికగా హుమా ఖురేషి
- త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటన
ఈ సినిమాలో అజిత్ సరసన కథానాయికగా హుమా ఖురేషి నటిస్తోంది. ఇక ప్రతినాయకుడిగా తెలుగు హీరో కార్తికేయ కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన విలన్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా తరువాత కోలీవుడ్ లో విలన్ గా కూడా కార్తికేయ బిజీ కానున్నాడని చెబుతున్నారు. అజిత్ - హెచ్. వినోద్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన 'నెర్కొండ పారవై' భారీ విజయాన్ని అందుకుంది. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.