తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాయలసీమకు అన్యాయం చేయాలనుకోవడం సిగ్గుచేటు: విష్ణువర్ధన్ రెడ్డి
- ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు
- అమీతుమీకి తెలంగాణ సిద్ధమంటూ కథనాలు
- ఘాటుగా స్పందించిన విష్ణు
- జగన్ ఎందుకు స్పందించడంలేదని నిలదీత
"శ్రీశైలంలో వేల ఎకరాలు ఇచ్చి, మా భూములు కోల్పోయాం. ముంపు మాకు... నీళ్లు మీకు ఇస్తున్నాం. మేం కూడా మా భూమి, మా నీళ్లు అంటే మీరు అంగీకరిస్తారా?" అని నిలదీశారు.
"ఏపీ సీఎం జగన్ గారూ, మీరు తెలంగాణ క్యాబినెట్ వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడంలేదు? మీ రెండు పార్టీల మధ్య సంబంధాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను బలిచేస్తారా? రాయలసీమ ఎంపీలు, ఎమ్మెల్యేలారా.... తెలంగాణలో మీ వ్యాపారాల కోసం సీమ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడతారా? రాయలసీమ నీటి ప్రాజెక్టులు, రాజోలిబండ (ఆర్డీఎస్) అక్రమ ప్రాజెక్టులు అని కేసీఆర్ ఆరోపణలు చేస్తుంటే, తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై మీరెందుకు మాట్లాడడంలేదు? రాయలసీమవి అక్రమ ప్రాజెక్టులు అయితే, తెలంగాణవి సక్రమ ప్రాజెక్టులా?" అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.