Vizag: విశాఖ అడవుల్లో ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోల మృతి

  • కొయ్యూరు మండ‌లం మంప పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఘ‌ట‌న‌
  • మావోయిస్టులు ఉన్నార‌న్న స‌మాచారంతో కూంబింగ్
  • హెలికాప్ట‌ర్ సాయంతోనూ గాలింపు చ‌ర్యలు
  • అద‌న‌పు బ‌ల‌గాల‌ సైతం త‌ర‌లింపు
firing in vizag

విశాఖప‌ట్నం జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జ‌రిగి ఆరుగురు మావోలు మృతి చెందారు. జిల్లాలోని కొయ్యూరు మండ‌లం మంప పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని తీగ‌ల‌మెట్ట‌ వ‌ద్ద‌ గ్రేహౌండ్స్ ప‌రిధిలో మావోయిస్టులు ఉన్నార‌న్న స‌మాచారంతో అడ‌విలో పోలీసులు కూంబింగ్ చేప‌ట్టగా ఈ కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల వివ‌రాలతో పాటు ఎంత మంది గాయ‌ప‌డ్డార‌న్న వివ‌రాలు తెలియాల్సి ఉంద‌ని పోలీసులు చెప్పారు.

ఆ ప్రాంతంలో ఉద‌యం నుంచి కూంబింగ్ కొన‌సాగుతోంది. హెలికాప్ట‌ర్ సాయంతో గాలింపు చ‌ర్యలు చేప‌ట్టారు. అక్క‌డికి అద‌న‌పు బ‌ల‌గాల‌ను సైతం త‌ర‌లిస్తున్నారు. అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. అంతేగాక‌, సరిహద్దులో వాహన తనిఖీలనూ ముమ్మరం చేశారు. కాల్పులు జ‌రిగిన ప్రాంతంలో ఏకే- 47, తుపాకులు ల‌భ్య‌మ‌య్యాయ‌ని పోలీసులు చెప్పారు.

More Telugu News