తెలంగాణలో నిన్న 1,498 కరోనా కేసుల నమోదు .. ఆరుగురి మృత్యువాత
- నిన్న 62,350 మందికి కరోనా పరీక్షలు
- 1,729కి చేరిన మరణాల సంఖ్య
- జీహెచ్ఎంసీ పరిధిలో 313 కేసులు
అలాగే, 3,03,013 మంది కరోనా కోరల నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9,993 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. వీరిలో 5,323 మంది హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 62,350 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిన్న 313 కేసులు వెలుగుచూశాయి.